రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక గణాంకాలను విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో కీలక గణాంకాలను విడుదల చేసింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే, కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఆ వివరాలు క్లుప్తంగా:
2022 నుంచి ఇప్పటివరకు 202 మంది భారతీయులు రష్యా సైన్యంలో చేరారు.
యుద్ధంలో 26 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురి ఆచూకీ లభ్యం కాలేదు.
భారత ప్రభుత్వం జరిపిన దౌత్య ప్రయత్నాల వల్ల ఇప్పటివరకు 119 మంది సురక్షితంగా భారత్కు చేరుకున్నారు.
ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, ఇంకా 50 మంది భారతీయులు రష్యా సైన్యం నుంచి విడుదల కావాల్సి ఉంది. వీరిని వెనక్కి రప్పించేందుకు రష్యా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
ముఖ్యమైన అప్డేట్స్:
మరణించిన 26 మందిలో 10 మంది మృతదేహాలను దేశానికి తీసుకువచ్చారు. ఇద్దరి అంత్యక్రియలు రష్యాలోనే పూర్తయ్యాయి.
గల్లంతైన వారిని గుర్తించేందుకు 18 మంది కుటుంబ సభ్యుల DNA నమూనాలను రష్యాకు పంపారు.
విడుదలైన వారికి ప్రయాణ పత్రాలు (Travel Documents) , విమాన టిక్కెట్లు భారత రాయబార కార్యాలయమే సమకూరుస్తోంది.
“రష్యా సైన్యంలో ఉన్న మిగిలిన భారతీయులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చే వరకు మా ప్రయత్నాలు కొనసాగుతాయని కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.

