తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం (డిసెంబర్ 20, 2025) హైదరాబాద్లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. గ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం (డిసెంబర్ 20, 2025) హైదరాబాద్లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తనపై నమోదైన మూడు కేసుల విచారణలో భాగంగా ఆయన కోర్టుకు వచ్చారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం, తిరుమలగిరి, మఠంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన ఈ కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు, రాజకీయ కార్యక్రమాల సందర్భంలో జరిగిన సంఘటనలకు సంబంధించినవి. అప్పట్లో రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ కేసులు దాఖలయ్యాయి.కోర్టులో న్యాయమూర్తి ఎదుట రేవంత్ రెడ్డి ఎగ్జామినేషన్ (స్టేట్మెంట్ రికార్డింగ్) ప్రక్రియను పూర్తి చేశారు.
ముఖ్యమంత్రి హాజరు నేపథ్యంలో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులు, సామాన్య ప్రజలను కోర్టు హాలు సమీపంలోకి అనుమతించలేదు.

