ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్లో క్రిస్మస్ మార్నింగ్ సర్వీస్కు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో అక్కడికి
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్లో క్రిస్మస్ మార్నింగ్ సర్వీస్కు హాజరయ్యారు. పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చిన క్రైస్తవులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. క్యారోల్స్, హిమ్స్లలో పాల్గొన్నారు.ఢిల్లీ బిషప్ రెవరెండ్ డాక్టర్ పాల్ స్వరూప్ ప్రధానికి ప్రత్యేక ప్రార్థన చేశారు. ఈ సేవలో ప్రేమ, శాంతి, కరుణ సందేశం ప్రతిబింబించిందని మోడీ తెలిపారు.
ఎక్స్లో పోస్ట్ చేసిన మోడీ: “ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్లో క్రిస్మస్ ఉదయ సేవలో పాల్గొన్నాను. ఈ సేవ ప్రేమ, శాంతి, కరుణ యొక్క శాశ్వత సందేశాన్ని ప్రతిబింబిస్తుంది. క్రిస్మస్ స్ఫూర్తి మన సమాజంలో సామరస్యం, సద్భావనను ప్రేరేపించాలి.” అని ట్విట్టర్ లో మోడీ పోస్ట్ చేశారు.
అంతకుముందు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన మోడీ: “శాంతి, కరుణ, ఆశతో నిండిన ఆనందమయ క్రిస్మస్ను కోరుకుంటున్నాను. యేసు క్రీస్తు బోధలు మన సమాజంలో సామరస్యాన్ని బలోపేతం చేయాలి.”గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాని మోడీ క్రైస్తవ సముదాయ కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు, ఇది దేశంలో మత సామరస్యాన్ని ప్రోత్సహిస్తోంది.ఈ సందర్భంగా మోడీ చర్చి నుంచి పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
May Christmas bring renewed hope, warmth and a shared commitment to kindness.
— Narendra Modi (@narendramodi) December 25, 2025
Here are highlights from the Christmas morning service at The Cathedral Church of the Redemption. pic.twitter.com/BzvKYQ8N0H

