తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక నిర్ణ
తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసన సభ, శాసన మండలిలో పార్టీ తరఫున వ్యవహరించే డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాయని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
నియామకాల వివరాలు:శాసనసభ (అసెంబ్లీ) డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు:టి. హరీశ్ రావు (మాజీ మంత్రి),
సబితా ఇంద్రారెడ్డి (మాజీ మంత్రి),తలసాని శ్రీనివాస్ యాదవ్ (మాజీ మంత్రి)
శాసన మండలి డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు (ఉపనేతలు):ఎల్. రమణ,పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి
శాసన మండలి విప్: దేశపతి శ్రీనివాస్
ఈ నియామకాలు శాసనసభ, మండలి సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసి, ప్రభుత్వాన్ని బలంగా ఎదుర్కొనేందుకు ఉపయోగపడతాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో రైతు రుణమాఫీ, నీటి పంపిణీ, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈ నాయకులు కీలక పాత్ర పోషించనున్నారు.

