HomeEditor's ChoiceGeneral

అత్యాచారాలు డ్రెస్‌ల వల్ల కాదు మగవాళ్ల క్రూరత్వం వల్ల జరుగుతాయి -శివాజీకి నాగబాబు కౌంటర్

అత్యాచారాలు డ్రెస్‌ల వల్ల కాదు మగవాళ్ల క్రూరత్వం వల్ల జరుగుతాయి -శివాజీకి నాగబాబు కౌంటర్

నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించారు. ఇటీవల 'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మహిళలు, ముఖ్యంగా హీరోయిన

అది పితృస్వామ్య అహంకారామే -అనసూయ కామెంట్
నటుడు శివాజీ హీరోయిన్లపై పురుషాహంకార ‘XXX’ వ్యాఖ్యలు…. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్న మహిళలు
క్షమాపణ చెప్పిన శివాజీ… అందులో నిజాయితీ ఉందా ?

నటుడు శివాజీ మహిళల దుస్తులపై చేసిన వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా స్పందించారు. ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శివాజీ మహిళలు, ముఖ్యంగా హీరోయిన్లు రివీలింగ్ డ్రెస్‌లు ధరించకూడదని, చీరలు లేదా పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర వివాదానికి దారితీసింది. శివాజీ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా, మోరల్ పోలీసింగ్‌లా ఉన్నాయని పలువురు సెలబ్రిటీలు (అనసూయ, చిన్మయి, మంచు మనోజ్ మొదలైనవారు) విమర్శించారు.తాజాగా (డిసెంబర్ 26, 2025న) జనసేన నేత, నటుడు నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. తన సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసిన నాగబాబు, శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు

మహిళల వస్త్రధారణ పూర్తిగా వారి వ్యక్తిగత హక్కు అని, ఒక మహిళ ఎలాంటి దుస్తులు ధరించాలో ఎవరికీ ఆదేశాలు ఇచ్చే హక్కు లేదని నాగబాబు స్పష్టం చేశారు.మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన‌ మగ అహంకారంతో మహిళలపై మాట్లాడడం సరికాదన్నారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు డ్రెస్‌ల వల్ల కాదని, మగవాళ్ల క్రూరత్వం వల్ల జరుగుతున్నాయని నాగబాబు అన్నారు. మగవారితో సమానంగా బతికే హక్కు మహిళలకు ఉందని ఆయన పేర్కొన్నారు.

“అలా మాట్లాడేందుకు ఏం హక్కుంది?” అని శివాజీని నాగబాబు ప్రశ్నించారు. తాను శివాజీని పేరుపెట్టి టార్గెట్ చేయడం లేదని కూడా వివరణ ఇచ్చారు.ఈ వివాదంలో శివాజీ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు, కానీ నాగబాబు స్పందనతో మరోసారి చర్చ జోరుగా సాగుతోంది.