పశ్చిమ బెంగాల్లోని హౌరా, సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 12703) రెండు కోచ్లు శుక్రవారం యాదాద్రి-భువనగిరి జిల్లా
పశ్చిమ బెంగాల్లోని హౌరా, సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ (ట్రైన్ నంబర్ 12703) రెండు కోచ్లు శుక్రవారం యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి.
పగిడిపల్లి-బొమ్మాయిపల్లి రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది.
ఒక కోచ్ నుంచి పొగలు, మంటలు వ్యాపించాయి.
ప్రమాదాన్ని గమనించిన వెంటనే రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
పక్కనే ఉన్న బోగీల్లో ఉన్న పలువురు భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. అయితే భయాందోళనలకు గురైన ప్రయాణీకులు రైలు నుంచి కిందికి దూకు పరుగులు పెట్టారు.
తర్వాత, కోచ్లను వేరు చేసి, భద్రతా తనిఖీలు చేసిన తర్వాత, అధికారులు రైలును ఫ్లాగ్ ఆఫ్ చేశారు.

